45 మృతుల కుటుంబాలకు సాయం..

by  |
45 మృతుల కుటుంబాలకు సాయం..
X

దిశ, భువనగిరి రూరల్ : యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మండలంలో కాంగ్రెస్ నేత అనిల్ కుమార్ రెడ్డి కరోనా మృతుల కుటుంబాలకు అండగా నిలిచారు. ఏకంగా 45 మంది బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం చేశారు. మండల పరిధిలోని పిల్లయిపల్లి, దేశముఖి, ఇంద్రియాల, పెద్ద రావుల పల్లి, శివారెడ్డి గూడెం గ్రామాల్లో పర్యటించి.. కరోనా, ఇతర కారణాలతో ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలను పరామర్శించారు. తన సొంత డబ్బుల్లో నుంచి రూ. 4 లక్షల నగదును 45 కుటుంబాలకు పంచారు. ఈ సందర్భంగా అనిల్ కుమార్ రెడ్డి సమక్షంలో దేశముఖి గ్రామం నుంచి పలువురు టీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్‌లో చేరారు.



Next Story

Most Viewed