- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, చెన్నారావుపేట: మండల కేంద్రంలో ఉన్న తిరుమల, రాజన్న వైన్స్ యజమానులపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బుఖ్య గోపాల్ నాయక్ తహసీల్దార్ కి వినతి పత్రం అందజేశారు. అనంతరం గోపాల్ నాయక్ మాట్లాడుతూ.. ఫుల్ బాటిల్ ను ఎం.ఆర్.పీ ధర కంటే అధికంగా రూ.80కి అమ్ముతున్నారని ఆరోపించారు. అధిక ధరలతో ప్రజల పైన భారం మోపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని పలుమార్లు యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోవట్లేదన్నారు. తహసీల్ధార్, ఎక్సైజ్ సి.ఐ , స్థానిక ఎస్.ఐ లకు ఫిర్యాదు చేశామన్నారు.
వెంటనే సంబంధిత అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేశారు. ఇక ముందు ఎం.ఆర్.పీ రేట్ల కంటే అధిక ధరలకు అమ్మితే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వైన్ షాపుల ముందు ధర్నాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు తల్లపెల్లి నర్సయ్య గౌడ్, నెక్కొండ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మంద యాకయ్య గౌడ్, కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు నన్నెబొయిన రమేష్ యాదవ్, లక్క రాజు, మాధసి మల్లయ్య, రవి, రవీందర్ నాయక్, లక్క విజేందర్, బొంద్యాలు, హంస నవీన్ కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.