లాంతర్లతో కాంగ్రెస్ నేతలు

by  |
లాంతర్లతో కాంగ్రెస్ నేతలు
X

దిశ, వెబ్ డెస్క్: విద్యుత్ బిల్లుల విషయమై కాంగ్రెస్ నేతలు పోరుబాటపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. నాంపల్లిలోని గాంధీ భవన్ నుంచి లాంతర్లతో విద్యుత్ సౌధకు చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, షబ్బీర్ అలీ సహా పులువురు సీనియర్ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం కరోనా కట్టడి విషయంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. లాక్ డౌన్ సమయంలో ప్రజల కష్టాలు వర్ణనాతీతమని, ప్రజలను ఆదుకోవాల్సిన ప్రభుత్వం అధిక విద్యుత్ బిల్లులు విధించడం సరికాదన్నారు. వెంటనే ప్రభుత్వం లాక్ డౌన్ సమయంలోని విద్యుత్ బిల్లులను మాఫీ చేయాలని వారు డిమాండ్ చేశారు.


Next Story

Most Viewed