ఏడేళ్లలో ఇదే తొలిసారి.. కాంగ్రెస్ నేతలకు కేసీఆర్ అపాయింట్‌మెంట్!

by  |
ఏడేళ్లలో ఇదే తొలిసారి.. కాంగ్రెస్ నేతలకు కేసీఆర్ అపాయింట్‌మెంట్!
X

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి టీఆర్ఎస్ పార్టీనే అధికారంలో కొనసాగుతూ వస్తుంది. అయితే, రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ తన ఏడేళ్ల పాలనలో ఒక్కసారి కూడా ప్రతిపక్ష నాయకులకు అపాయింట్ మెంట్ ఇవ్వలేదు. ఈ క్రమంలోనే తొలిసారిగా శుక్రవారం కాంగ్రెస్ నాయకులకు కేసీఆర్ అపాయింట్‌మెంట్ దొరికింది.

మరికాసేపట్లో సీఎం క్యాంప్ ఆఫీస్ ప్రగతి భవన్‌లో కాంగ్రెస్ లీడర్లు భట్టి విక్రమార్క, జగ్గారెడ్డి, శ్రీధర్ బాబుతో కేసీఆర్ భేటీ కానున్నారు. ఈ సమావేశంలోయాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడురులో జరిగిన మరియమ్మ లాకప్ డెత్ గురించి ముఖ్యమంత్రికి కాంగ్రెస్ లీడర్లు ఫిర్యాదు చేయనున్నట్లు సమాచారం. ఇదిలాఉండగా, ఈ కేసులో ఇప్పటికే స్టేషన్ ఎస్సైతో పాటు మరో ఇద్దరు సిబ్బందిని ఉన్నతాధికారులు సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.

Next Story

Most Viewed