నాంపల్లిలో ఉద్రిక్తత.. భారీగా మోహరించిన పోలీసులు

by  |
నాంపల్లిలో ఉద్రిక్తత.. భారీగా మోహరించిన పోలీసులు
X

దిశ, వెబ్ డెస్: నాంపల్లిలోని గాంధీ భవన్ వద్ద ఉద్రిక్తత నెలకొన్నది. రాజ్ భవన్ వైపు వెళ్తున్న కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నది. కాగా, రాజస్థాన్ రాజకీయ సంక్షోభం నెలకొన్నది. ఈ నేపథ్యంలో బీజేపీకి వ్యతిరేకంగా రాజ్ భవన్ వద్ద ధర్నాలు చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ పిలుపునిచ్చింది.

దీంతో రాష్ట్రంలోని కాంగ్రెస్ నేతలు సోమవారం రాజ్ భవన్ వద్ద ధర్నా నిర్వహించేందుకు నాంపల్లిలోని గాంధీ భవన్ నుంచి వెళ్లేందుకు బయల్దేరారు. బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతలు నినాదాలు చేశారు. అప్పటికే అక్కడ భారీగా మోహరించిన పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.



Next Story