కాంగ్రెస్ నాయకుల అరెస్ట్

by  |
కాంగ్రెస్ నాయకుల అరెస్ట్
X

దిశ, కోరుట్ల: కోరుట్ల నియోజకవర్గంలో నేడు మంత్రులు నిరంజన్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్ పర్యటనను అడ్డుకుంటారని.. మల్లాపూర్ మండల కేంద్రంలో పలువురు కాంగ్రెస్ నేతలను ముందస్తుగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు కోరుట్ల ఎమ్మేల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు గురువారం చేసిన వివాదస్పద వాఖ్యలతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ సింధు శర్మ ఇక్కడే మకాం వేసి మంత్రుల పర్యటనలకు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మల్లాపూర్, ఇబ్రహీంపట్నం ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహరించారు. కాగా, మెట్‌పల్లి పట్టణంలో సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మన దహనం చేసేందుకు యత్నింంచిన బీజేపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు.



Next Story