ఛలో సెక్రటేరియట్..కాంగ్రెస్ నేతల అరెస్టు

by  |
ఛలో సెక్రటేరియట్..కాంగ్రెస్ నేతల అరెస్టు
X

దిశ, ఎల్బీనగర్ :
గాంధీ ఆస్పత్రిలో జూనియర్ డాక్టర్లు తలపెట్టిన సమ్మెకు మద్దతుగా..విద్యుత్ ఛార్జీల పెంపుదలకు నిరసనగా గురువారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ‘ఛలో సెక్రటేరియట్ ముట్టడి’కి పిలుపునిచ్చారు. దీంతో ఎల్బీనగర్ నియోజకవర్గంలో టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి గజ్జి భాస్కర్ యాదవ్, పార్టీ సీనియర్ నాయకులు కొప్పుల నర్సింహా రెడ్డితోపాటు పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..సీఎం కేసీఆర్ నియంత పాలనలో ప్రజలకు అనునిత్యం వైద్య సేవలందిస్తున్న వైద్యులే రోడ్డుపైకి వచ్చారంటే రాష్ట్రంలో పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థమవుతుందన్నారు. టీఆర్ఎస్ పాలనను ప్రజలు గమనిస్తూనే ఉన్నారని, వారికి తగిన సమయంలో గుణపాఠం తప్పక చెబుతారని హెచ్చరించారు.

Next Story

Most Viewed