అభివృద్ధి కోసం పార్టీ మారావు.. ఇప్పుడు ఈ పనేంటి..?

by  |
అభివృద్ధి కోసం పార్టీ మారావు.. ఇప్పుడు ఈ పనేంటి..?
X

దిశ, ఎల్లారెడ్డి: హస్తం గుర్తుపై గెలిచి నియోజకవర్గ అభివృద్ధి కోసం కారు పార్టీలోకి చేరి రెండేళ్లు పూర్తయినా.. ప్రజా సమస్యలను వదిలి పక్క నియోజకవర్గంలో ప్రచారానికి వెళ్తారా అంటూ ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్‌పై కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే వస్తున్నారని తెలుసుకున్న కాంగ్రెస్ నాయకులు ఫంక్షన్ హాలు వద్ద నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే సురేందర్‌ను అడ్డుకునే ప్రయత్నం చేయగా పోలీసులు వారిని అరెస్టు చేశారు. దీంతో ఎమ్మెల్యేకు, పోలీసులకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నాయకులు నినాదాలు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. నియోజకవర్గంలో నెలకొన్న ప్రజా సమస్యలను అసెంబ్లీలో చర్చించాల్సిన ఎమ్మెల్యే తిరుమలగిరిలో ప్రచారానికి వెళ్తారా అని ప్రశ్నించారు. ప్రజలు సమస్యల్లో ఉంటే పక్క నియోజకవర్గంతో ఏం పని అంటూ నిలదీశారు. ఎమ్మెల్యే అయినా తర్వాత పార్టీమారిన జాజాల సురేందర్ సొంత నియోజకవర్గాన్ని ఏ మేరకు అభివృద్ధి చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.

Next Story

Most Viewed