ముహుర్తం ఫిక్స్.. టీఆర్ఎస్‌లోకి కాంగ్రెస్ కీలక నేత..?

by  |
ముహుర్తం ఫిక్స్.. టీఆర్ఎస్‌లోకి కాంగ్రెస్ కీలక నేత..?
X

దిశ ప్రతినిధి, కరీంనగర్ : ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుడు ఒకరు టీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్దమైంది. గతంలో కరీంనగర్ నుండి పోటీ చేసిన ఆయన ఓటమి చవి చూశారు. కొంత కాలంగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వ్యాపారాలు చూసుకుంటున్నారు. అయితే, ఆయన టీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులతో చర్చలు జరిపి కాంగ్రెస్‌ను వీడేందుకు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. 2023 ఎన్నికల్లో వేమువాడ నుండి టీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేయించే యోచనలో గులాబీ పార్టీ అధిష్టానం ఉన్నట్టు సమాచారం. ఈనెల 8న ముఖ్యమంత్రి కేసీఆర్ లేదా మంత్రి కేటీఆర్ సమక్షంలో ఆయన పార్టీలో చేరనున్నట్టు సమాచారం.



Next Story

Most Viewed