కాంగ్రెస్‌కు షాకిచ్చి.. ‘కారు’ ఎక్కిన కీలక నేత

by  |
కాంగ్రెస్‌కు షాకిచ్చి.. ‘కారు’ ఎక్కిన కీలక నేత
X

దిశ, ఇబ్రహీంపట్నం : యాచారం మండల పరిధిలోని కొత్తపల్లి గ్రామ సర్పంచ్ హబీబుద్దిన్ గురువారం ఎమ్మెల్యే కిషన్ రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్‌లో చేరారు. ఈ మేరకు ఎమ్మెల్యే.. సర్పంచ్‌ను టీఆర్ఎస్ కాండువతో సన్మానించి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ హభీబుద్దిన్ మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వ పాలనను అన్ని రంగాల, అన్ని వర్గాల ప్రజలు ఆదరిస్తున్నారని ఈ క్రమంలో కొత్తపల్లి గ్రామం మరింత అభివృద్ధి పథంలో ఉండాలని, గ్రామాభివృద్దే లక్ష్యంగా టీఆర్ఎస్‌లో చేరడం జరిగిందన్నారు. సర్పంచ్‌తో పాటు పలువురు వార్డు సభ్యులు కూడా టీఆర్ఎస్‌లో చేరారు. కార్యక్రమంలో మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు కర్నాటి రమేష్ గౌడ్, ప్రధాన కార్యదర్శి పాశ్చ భాష, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Next Story