నాలుక చీరేస్తాం.. కౌశిక్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చిన కాంగ్రెస్ నేత

by  |
koushik reddy
X

దిశ, ధర్మపురి: కౌశిక్ రెడ్డి నీ స్థాయిని మించి కాంగ్రెస్ నాయకులపై అనుచిత వాఖ్యలు చేస్తే నాలుక చీరేస్తామని డీసీసీ అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హెచ్చరించారు. ధర్మపురి నియోజక వర్గంలోని ధర్మారం మండల కేంద్రంలో మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. కౌశిక్ రెడ్డి అతని స్థాయిని మరిచిపోయి మతిభ్రమించి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి మాణిక్యం ఠాకూర్ , పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, మాజీ ఎంపీ పోన్నం ప్రభాకర్ పై అసభ్య పదాజలంతో దూషించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో నీ స్థాయి ఏంటో తెలుసుకో కౌశిక్ రెడ్డి.. కనీసం ఏ రోజు కూడా ప్రజల కష్టాలలో పాలు పంచుకున్నోనివి కాదు.. ప్రజా సమస్యలపై పోరాటం చేసినోనివి కాదు.. కేవలం మాజీ పీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి తమ్ముడువి అనే ఒకేఒక కారణంతో నీకు కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ వచ్చింది అని వ్యాఖ్యానించారు.

‘స్థాయి ఏంటో ఒకసారి చూసుకోని మాట్లాడు. రేవంత్ రెడ్డి రూ.20 కోట్లు పెట్టి అధ్యక్ష పదవి కోనుకున్నడు అని విమర్శలు చేస్తున్నవు. నీ దగ్గర ఏమైనా అధారాలు ఉంటే బయట పెట్టు.. అసత్య అరోపణలు చేస్తే నాలుక కోస్తాం’ అని లక్ష్మణ్ కుమార్ హెచ్చరించారు. పీసీసీ అధ్యక్ష పదవి కోనుక్కుంటే వచ్చేది కాదు.. రాష్ట్రంలో ఉన్న ప్రతిఒక్క కార్యకర్త, నాయకుడు కోరుకున్న నాయకుడు రేవంత్ రెడ్డి.. ఆయన పీసీసీ అధ్యక్షుడు కాగానే మొదటిరోజే నువ్వు పూలబోకే తీసుకెళ్ళి కల్సిన రోజు ఎటు పోయింది మీ తెలివి.. కేసీఆర్ కు కోవర్ట్ గా మారి కేసీఆర్ రాసియిచ్చిన స్క్రిప్ట్ చదివితే హూజురాబాద్ టికెట్ వస్తుందని భ్రమపడి పిచ్చిపిచ్చిగా వాగుతున్నావా? అని అన్నారు. కౌశిక్ రెడ్డి ఇంకోసారి నీ స్థాయి మరిచి పిచ్చి పిచ్చి మాటలు మాట్లడితే నాలుక చీరేస్తాం.. ఖబడ్దార్’ అని హెచ్చరించారు.


Next Story

Most Viewed