బీజేపీ దేశాన్ని అమ్ముతోంది : వీహెచ్

by  |
Congress leader VH
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ కీలక నేత, మాజీ మంత్రి వి.హనుమంతరావు కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… ప్రభుత్వ వ్యవస్థలను ప్రైవేట్ పరం చేస్తే.. రిజర్వేషన్లు ఎలా సాధ్యం అని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చే ముందు ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలిస్తామని చెప్పి, ఇప్పుడు ఉన్న ఉద్యోగాలు ఊడగొడుతున్నారని మండిపడ్డారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక దేశాన్ని కార్పొరేట్ శక్తులకు అమ్ముకుంటున్నారని ఆగ్రహం వ్తక్తం చేశారు. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా అన్ని పార్టీలు కలిసి పోరాటం చేయాలని పిలపునిచ్చారు. ‘విశాఖ ఉక్కు-మా హక్కు’ అని పోరాటం చేస్తున్నామని గుర్తుచేశారు.


Next Story

Most Viewed