‘అమరావతికి వెన్నుపోటు పొడిచారు’

by  |
‘అమరావతికి వెన్నుపోటు పొడిచారు’
X

దిశ, ఏపీ బ్యూరో: అమరావతి రాజధానికి ముఖ్యమంత్రి జగన్ చేస్తున్న ద్రోహంతో పాటు, బీజేపీ నాయకులు పొడుస్తున్న వెన్నుపోటు దారుణంగా ఉందని కాంగ్రెస్ నాయకురాలు సుంకర పద్మశ్రీ అన్నారు. వైసీపీ, బీజేపీ నాయకుల వికృత రాజకీయ క్రీడకు అమాయక రాజధాని రైతులు బలవుతున్నారని చెప్పారు. జగన్ ఏపీకి మూడు రాజధానులు అంటే, శంఖుస్థాపన చేసిన ప్రధాని మోదీ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. దీంతో బీజేపీ ద్వంద్వ నీతి స్పష్టంగా బయట పడుతోందని సుంకర పద్మశ్రీ విమర్శించారు.



Next Story