సీఎం యడియూరప్పకు ఏప్రిల్ డెడ్‌లైన్? : సిద్ధరామయ్య

by  |
సీఎం యడియూరప్పకు ఏప్రిల్ డెడ్‌లైన్? : సిద్ధరామయ్య
X

దిశ, వెబ్‌డెస్క్ : కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్పపై ప్రతిపక్షనేత, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆదివారం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది ఏప్రిల్ తర్వాత యడియూరప్ప ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించబడతారని వ్యాఖ్యలు చేశారు.

దీనిపై స్పందించిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అలాంటిదేమీ ఉండదని, కర్ణాటక అసెంబ్లీ టర్మ్ పూర్తయ్యే వరకు అనగా 2023వరకు ఆయనే సీఎంగా కొనసాగుతారని స్పష్టం చేశారు. అయితే, తాను చెప్పింది అక్షరాల నిజం అవుతుందని, తనకు ఆర్‌ఎస్‌ఎస్ వర్గాల నుంచి అందిన విశ్వసనీయ సమాచారం మేరకు జరిగి తీరుతుందని సిద్దరామయ్య వెల్లడించారు.


Next Story

Most Viewed