‘కేసీఆర్@అలీబాబా చాలీస్ చోర్.. ఆ దొంగల ముఠాకు నాయకుడు’

by  |
cm kcr
X

దిశ, మహేశ్వరం: సీఎం కేసీఆర్ పై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సోమవారం రంగారెడ్డి జిల్లా కందుకూరు మండల కేంద్రంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరుగుదలను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎడ్లబండ్ల నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా మధుయాష్కీ గౌడ్ మాట్లాడుతూ… తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అలీబాబా చాలీస్ చోర్ లా దోచుకుంటున్నారని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి సామాన్యుల నడ్డి విరుస్తున్నాయన్న ప్రభుత్వాలను గద్దె దించాలన్నారు.

congress leader

కాంగ్రెస్ పార్టీ సామాన్యుల పార్టీ అని, కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచిన దొంగలను తన పంచన చేర్చుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ను బడా చోర్ అని విమర్శించారు. కాంగ్రెస్ పైరాయింపు దొంగల ముఠా నాయకుడు చంద్రశేఖర్ రావును గద్దె దింపాల్సిన అవసరముందన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు చల్ల నర్సింహారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మాల్ రెడ్డి రంగారెడ్డి, నాయకులు దేప భాస్కర్ రెడ్డి, ఏనుగు జంగారెడ్డి, కృష్ణ నాయక్, రాం రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed