దళితులకు కాంగ్రెస్ అండ: సంపత్ కుమార్

by  |
దళితులకు కాంగ్రెస్ అండ: సంపత్ కుమార్
X

దిశ, వెబ్ డెస్క్: దళితులను ప్రభుత్వం మానసికంగా వేధిస్తోందని కాంగ్రెస్ నేత సంపత్ కుమార్ ఆరోపించారు. ప్రభుత్వం తన భూమిని ఆక్రమించిందన్న కారణంతో సీఎం నియోజకవర్గంలోనే ఓ దళితుడు ఆత్మహత్య చేసుకున్నాడని అన్నారు. ఈ ఘటనపై ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. ఈ ఘటనకు సంబంధించిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇసుక మాఫియాను అడ్డుకున్న దళిత వ్యక్తిని లారీతో తొక్కించారని దుయ్యబట్టారు. దళితులకు కాంగ్రెస్ పార్టీ వారికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. దళిత జాతినే మోసం చేస్తున్న కొంత మంది టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారని ఆయన అన్నారు.

Next Story

Most Viewed