సంజయ్ కౌన్సిలర్‌కు తక్కువ.. చైర్మన్‌కు ఎక్కువ: సంపత్

by  |
సంజయ్ కౌన్సిలర్‌కు తక్కువ.. చైర్మన్‌కు ఎక్కువ: సంపత్
X

దిశ, తెలంగాణ బ్యూరో: గ్రేటర్​లో ఎన్నికల వాతావరణాన్ని బీజేపీ, టీఆర్ఎస్ కలుషితం చేస్తున్నాయని ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ విమర్శించారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ… ఒకడు కిరాక్​, మరొకడు కిరికిర్​గాళ్లు కలిసి ప్రశాంతమైన హైదరాబాద్‌ను చెడగొట్టాలని చూస్తున్నారని, విచ్చలవిడిగా వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకోమన్నారు. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కౌన్సిలర్‌కు తక్కువ.. మున్సిపల్ చైర్మన్‌కు ఎక్కువని, సిగ్గుశరం లేకుండా మాట్లాడుతున్నాడని, ఇప్పటికైనా పద్దతిగా మాట్లాడాలని, దుబ్బాకలో గెలువగానే ఎగుతురున్నారని, సంజయ్ నోరు అదుపులో పెట్టుకుని వ్యాఖ్యలు చేయాలన్నారు. కిరికిరిరావు కేటీఆర్​ తప్పుడు లెక్కలు చెప్పుతున్నారన్నారు. మంత్రి కేటీఆర్​వి బేవకూఫ్​ మాటలని, కుట్రలకు సంబంధించి అన్ని ఆధారాలు ఉన్నప్పుడు సీఎం కేసీఆర్​, మంత్రి కేటీఆర్ ఎందుకు చర్యలు తీసుకోలేదని సంపత్ కుమార్ ప్రశ్నించారు.

Next Story

Most Viewed