'చనిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు'

by  |
Congress-Leader-Madhu
X

దిశ‌, అబ్దుల్లాపూర్‌మెట్‌: రైతుల‌కు అండ‌గా కాంగ్రెస్ పార్టీ ఉంటదని యూత్ కాంగ్రెస్ నేత చిలుక మ‌ధుసూద‌న్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ చేప‌ట్టిన దీక్షలో ఆయన పాల్గొని మాట్లాడారు. వ‌రి క‌ల్లాల వ‌ద్ద రైతులు గుండె ఆగి చ‌నిపోతున్నార‌ని ఆవేద‌న వ్యక్తం చేశారు. రైతులు పండించిన ఏ పంట‌కు కూడా గిట్టుబాటు ధ‌ర‌ రావ‌డంలేద‌న్నారు. రైతుల శ్రేయ‌స్సు కోసం పోరాడుతున్న కాంగ్రెస్ పార్టీకి ప్రతి ఒక్కరూ మద్దతిచ్చి, అండ‌గా నిల‌వాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు.


Next Story

Most Viewed