బీజేపీలో చేరడం లేదు… అవన్నీ వదంతులే

by  |
బీజేపీలో చేరడం లేదు… అవన్నీ వదంతులే
X

దిశ, వెబ్‌డెస్క్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి దెబ్బమీద దెబ్బ పడుతోంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి విజయశాంతి దాదాపు గుడ్ బై చెప్పగా, తాజాగా శుక్రవారం మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ బీజేపీలో చేరుతున్నట్టు ప్రకటించారు. అంతేగాకుండా మాజీ ఎంపీ, కాంగ్రెస్‌ నేత కొండా విశ్వేశ్వరరెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరుతున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు హల్‌చల్ చేయగా, తాజాగా దీనిపై ఆయన స్పందించాడు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ… తాను బీజేపీలో చేరడం లేదని, తనపై వస్తున్న వార్తలన్నీ అవాస్తవం అని కొట్టి పారేశారు. అంతేగాకుండా తనకు అన్ని పార్టీల్లో మిత్రులు ఉన్నారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.


Next Story

Most Viewed