భూ వివాదంలో కాంగ్రెస్ నేత కిడ్నాప్?

by  |

దిశ, మహబూబ్‌నగర్‌: భూ వివాదం వ్యవహారంలో మహబూబ్‎నగర్ జిల్లా జడ్చర్ల మాజీ సింగిల్ విండో చైర్మన్ రామచంద్రారెడ్డి కిడ్నాప్‌కు గురయ్యారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. షాద్‌నగర్ పరిధి ఫరూక్ నగర్ మండలం అన్నారంకు చెందిన ప్రతాప రెడ్డి, రామచంద్రారెడ్డి మధ్య చాలా కాలంగా ఓ భూవివాదం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే ఇరు వర్గాల మధ్య గొడవలు జరిగినట్లు సమాచారం. అంతేకాకుండా, ఈ వ్యవహారంపై షాద్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, శుక్రవారం షాద్‌నగర్‌లో తన కారులో ఉన్న రామచంద్రారెడ్డిని.. ప్రతాప్ రెడ్డి వచ్చి వెంట తీసుకెళ్లాడని రామచంద్రారెడ్డి డ్రైవర్ పోలీసులకు తెలిపాడు. దీంతో పోలీసులు ఆయన కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కిడ్నాప్‌కు గురైన ప్రాంతాన్ని షాద్ నగర్ ఏసీపీ సురేందర్ పరిశీలించారు. సీసీ టీవీల ఆధారణం ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Next Story

Most Viewed