హుజురాబాద్ సాక్షిగా ఈటల ఉరి వేసుకునేందుకు సిద్ధమేనా..!

by  |
eatala-rajender
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు ఈటల రాజేందర్ సమాధానం చెప్పాలని కాంగ్రెస్ లీడర్ కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు. శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. సీఎం కేసీఆర్ స్ర్కిప్ట్ ఇస్తే కౌశిక్ రెడ్డి చదువుతున్నాడంటూ అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు. బాధ్యతగల పదవిలో ఉండి కూడా ఎస్సీ, ఎస్టీ భూములను కొనడం తప్పని తెలిసి.. ఎందుకు కొనుగోలు చేశారని నిలదీశారు. భూములు కొనుగోలు చేసిన కేసులో ఈటల జైలు కెళ్లాల్సిందేనన్నారు కౌశిక్ రెడ్డి. ఈటల చేసిన అక్రమాలపై హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలకు సమాధానం చెప్పాలని.. వాస్తవాలు చూపించాలని డిమాండ్ చేస్తూనే.. ఆరోపణలు అబద్ధాలైతే హుజురాబాద్ అంబేద్కర్ బొమ్మ వద్ద ఉరివేసుకోవడానికి సిద్ధమే అని కౌశిక్ రెడ్డి సవాల్ విసిరారు. దీనికి ఈటల రాజేందర్‌ రెడీగా ఉన్నారా అంటూ చురకలు వేశారు కౌశిక్ రెడ్డి.

Next Story

Most Viewed