20 వేలకు మించడం లేదు: జీవన్‌రెడ్డి

by  |
20 వేలకు మించడం లేదు: జీవన్‌రెడ్డి
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనాను నియంత్రించడంలో ప్రభుత్వం విఫలమైందని కాంగ్రెస్ నేత జీవన్‌రెడ్డి విమర్శించారు. ప్రతి రోజూ 40 వేల టెస్టులు చేస్తామని ప్రభుత్వం కోర్టుకు చెప్పినా..వాస్తవంగా 20 వేలకు మించడం లేదన్నారు. కొత్త జిల్లాల్లో ప్రైవేట్ ఆసుపత్రులు లేవని.. ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో సౌకర్యాలు లేవన్నారు. ప్రైవేట్ ఆసుపత్రులపై ప్రభుత్వానికి నియంత్రణ లేదన్నారు. తన ప్రభుత్వ వైఫల్యాలను గవర్నర్‌రే చెప్పుకుంటుంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చని జీవన్ రెడ్డి అన్నారు. కరోనాను ఆరోగ్య శ్రీలో చేర్చాలని ఆయన డిమాండ్ చేశారు.

Next Story

Most Viewed