- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, హాలియా: సాగర్ నియోజకవర్గంలో ప్రతి పల్లె, తండాలో కనిపిస్తున్న అభివృద్ధి తాను మంత్రిగా ఉన్న కాలంలో చేసినదేనని మాజీ సీఎల్పీ నేత జానారెడ్డి తెలిపారు. శుక్రవారం నిడమనూర్ మండలం పరిధిలోని ఉట్కూర్, వెంకటాపురం,పెద్దవూర మండల పరిధిలోని చలకుర్తి గ్రామాల నుంచి వివిధ పార్టీలకు చెందిన సుమారు వంద కుటుంబాలు సాగర్లోని జానారెడ్డి నివాసంలో రామేశ్వరి, ఆవుల వెంకన్న, చంద్రశేఖర్ రెడ్డి, ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా జానారెడ్డి మాట్లాడుతూ… తాను మంత్రిగా ఉన్నప్పుడే లిఫ్టులను ఏర్పాటు చేసి బీడు భూములను సస్యశ్యామలం చేశానన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆరున్నర ఏళ్ళలో ఈ ప్రాంతంలో ఒక్క ఎకరానికి కూడా కొత్తగా నీళ్లు ఇచ్చింది లేదని చెప్పారు. కేవలం ఉప ఎన్నికల్లో ప్రజలను మరోసారి మోసగించేందుకే కేసీఆర్ అనేక హామీలు, శంకుస్థాపనలు చేస్తున్నారన్నారు. వాటిని గుర్తించి ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు.