సీపీ జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఏముంది !

by  |
సీపీ జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఏముంది !
X

దిశ, గజ్వేల్: టీఆర్ఎస్ ప్రభుత్వంపై కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు గీతారెడ్డి ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో రెండున్నర లక్షల కోట్ల అప్పులు చేసి ప్రజలపై భారం మోపారని విమర్శించారు. ఇప్పుడు ఎల్ఆర్ఎస్ పేరిట ప్రజలను తికమక పెడుతున్నారని మండిపడ్డారు. ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారని విమర్శించారు. సిద్దిపేటలో డబ్బుల గొడవలో సీపీ జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఏముందన్నారు. దుబ్బాకలో ప్రశ్నించే గొంతు రావాలంటే చెరుకు శ్రీనివాస్‌రెడ్డిని గెలిపించాలన్నారు. గజ్వేల్‌లో విలేకరుల సమావేశంలో గీతారెడ్డి పై వ్యాఖ్యలు చేశారు.



Next Story

Most Viewed