జర్నలిస్టులకు శానిటైజర్లు, మాస్కుల పంపిణీ

by  |
జర్నలిస్టులకు శానిటైజర్లు, మాస్కుల పంపిణీ
X

దిశ‌, ఖమ్మం:ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులకు జిల్లా ప్రెస్ క్లబ్‌లో ఖమ్మం సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎండీ జావిద్ శానిటైజ‌ర్లు, మాస్కులు పంపిణీ చేశారు. టీయూడబ్ల్యూజే (ఐజేయు) జర్నలిస్ట్ యూనియన్ ఖమ్మం నగర కన్వీనర్ మైస పాపారావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు నర్వనేని వెంకట్రావు, కాంగ్రెస్ కార్పొరేటర్లు వడ్డెబోయిన నరసింహారావు, నాగండ్ల దీపక్ చౌదరి, జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర, జిల్లా నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జావిద్ మాట్లాడుతూ కరోనా వైరస్ పట్ల జర్నలిస్టులంతా జాగ్రత్తగా ఉండాలని, విధి నిర్వహణలో తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా విపత్కర పరిస్థితులలో పని చేయడం అభినందనీయమని తెలిపారు.

tags: khammam press club, congress leader Md javeed, TUWJ, journalist, print media, electronic media, narvaneni venkatrao,


Next Story

Most Viewed