ఆ ఇద్దరు మంత్రులపై దాసోజు శ్రవణ్ సెన్సేషనల్ కామెంట్స్

by  |
ఆ ఇద్దరు మంత్రులపై దాసోజు శ్రవణ్ సెన్సేషనల్ కామెంట్స్
X

దిశ, తెలంగాణ బ్యూరో: ‘‘గుట్కా బ్యాచ్‌తో బంగారు తెలంగాణ ఎలా సాధిస్తారు.. ఇలాంటి మంత్రులతో సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారు.’’ అని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ప్రశ్నించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. మంత్రులు తలసాని శ్రీనివాస్, గంగుల కమలాకర్‌ బ్యాన్ చేసిన గుట్కాని బహిరంగ ప్రదేశాల్లో తింటూ వీడియోకి చిక్కిన తీరును ఆక్షేపించారు. రాజ్యంగంపై ప్రమాణం చేసిన మంత్రులు మత్తు పదార్ధాలని తినడాన్ని యావత్ తెలంగాణ సమాజం ఖండిస్తుందని పేర్కొన్నారు. దేనికి పనికిరాని సన్నాసులని మంత్రులని చేసిన కేసీఆర్… ఇంత నిర్లజ్జగా చట్టాన్ని ఉల్లఘించి బ్యాన్ చేసిన మత్తు పదార్ధాలు తింటున్న మంత్రులపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. గుట్కా మంత్రులని వెంటనే క్యాబినెట్ నుంచి బర్త్ రఫ్ చేయాలని డిమాండ్ చేశారు. మంత్రులపై ఎన్ డీపీఎస్ యాక్ట్ కింద కేసులు నమోదు చేయాలని కోరారు.



Next Story

Most Viewed