- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, దుబ్బాక : ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగను దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి సోమవారం విద్యానగర్ లోని ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. గత కొన్ని రోజుల కిందట ఢిల్లీలో జరిగిన ప్రమాదంలో మందకృష్ణ మాదిగ కాలు విరగడంతో సర్జరీ అనంతరం ఇటీవలే హైదరాబాద్కు వచ్చారు. ఈ సందర్భంగా దుబ్బాక నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి వారి ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు.
మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి తరపున ఎన్నో ఏళ్లుగా పోరాడుతున్న ఆయన త్వరగా కోలుకుని, మళ్ళీ పోరుబాట పట్టాలని కోరారు. ఈ సందర్భంగా మాజీమంత్రి స్వర్గీయ చెరుకు ముత్యం రెడ్డిని గుర్తు చేసుకొని ఆయనతో తనకున్న అనుబంధాన్ని శ్రీనివాస్ రెడ్డితో పంచుకున్నారు. నిత్యం ప్రజల మధ్య ఉంటూ తన నియోజకవర్గ పరిధిలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి నిస్వార్థంగా పనిచేశారని తెలిపారు. మందకృష్ణ మాదిగను కలిసిన వారిలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు బీఎన్ రమేష్, సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షుడు పుర్ర నర్సిములు, కృష్ణ గౌడ్లు ఉన్నారు.