‘ఆ ఎంపీలు గాడిదలు కాస్తున్నారా.. నిద్రపోతున్నారా?’

by  |
‘ఆ ఎంపీలు గాడిదలు కాస్తున్నారా.. నిద్రపోతున్నారా?’
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్‌పై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అసంతృప్తి వ్యక్తం చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీఆర్ఎస్, బీజేపీ ఎంపీలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ బడ్జెట్‌లో తెలంగాణకు కేంద్రం మళ్లీ నిరాశే మిగిల్చిందని అన్నారు. రాష్ట్రానికి కేంద్రం ఇంత అన్యాయం చేసినా.. టీఆర్ఎస్ ఎంపీలు స్పందించడం లేదని ఫైర్ అయ్యారు. టీఆర్ఎస్ ఎంపీలు నిద్రపోతున్నారా? లేక గాడిదలు కాస్తున్నారా? అని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్, బీజేపీ దొందూ దొందే అని, ఇరు పార్టీల అంతర్గత ఒప్పందం మూలంగా మౌనం పాటిస్తున్నారని మండిపడ్డారు. రైతులను మోసం చేయాలని కంకణం కట్టుకున్న రెండు ప్రభుత్వాలకు ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు.

Next Story

Most Viewed