అందులో ఆయనకేం జరిగినా.. రాజద్రోహమే

by  |
అందులో ఆయనకేం జరిగినా.. రాజద్రోహమే
X

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం ముంబయిలోని తలోజా జైలులో ఉన్న విప్లవ రచయింత సంఘం నేత వరవరరావు ఆరోగ్యం క్షీణిస్తోందని వెంటనే ఆయన్ను కాపాడాలని సీఎల్పీ నేత మల్లు భట్లి విక్రమాక్ర ప్రభుత్వాన్ని కోరారు. తక్షణమే ఆయన్ను జైలు నుంచి విడుదల చేసి, ఆస్పత్రికి తరలించి, ఆయనకు మెరుగైన వైద్యం అందించేలా చొరవ చూపాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ను, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డిని కోరారు. వరవరరావుకు జైల్లో ఏదైనా జరిగితే అది రాజద్రోహమే అవుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ఆరోగ్యాన్ని ప్రభుత్వం పోలీసులు పట్టించుకోకపోవడం దారుణం అని అన్నారు.

Next Story

Most Viewed