- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ ప్రతినిధి, కరీంనగర్/ వరంగల్ : కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి కజిన్ బ్రదర్ పాడి కౌశిక్ రెడ్డి ఆడియో కలకలం సృష్టిస్తోంది. టీఆర్ఎస్ టికెట్ తనకే వస్తుందని యూత్ను మొబులైజ్ చేయాలని ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. ఓ వైపున తాను కాంగ్రెస్ పార్టీ నుంచే పోటీ చేస్తానని చెప్తూ సీక్రెట్గా టీఆర్ఎస్ అభ్యర్థిగా గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నట్టుగా ఈ ఆడియో ద్వారా స్పష్టం అవుతోంది. హుజురాబాద్ నియోజకవర్గంలో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న పాడి కౌశిక్ రెడ్డి ఆడియో ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.
కమలాపూర్ మండలం మాదన్న పేటకు చెందిన ఓ యువకునితో మాట్లాడిన సంభాషణలో యూత్ను తనకు అనుకూలంగా మొబులైజ్ చేయాలని, అవసరమైతే వారికి రూ. 5 వేల వరకు ఇవ్వాలని కూడా కౌశిక్ రెడ్డి సూచించడం గమనార్హం. టీఆర్ఎస్ అభ్యర్థిగా తాను బరిలో నిలుస్తున్నానని కూడా ఆయన చెబుతుండటం చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రాజిరెడ్డితో టచ్లో ఉండాలని కూడా కౌశిక్ రెడ్డి సూచించడం సంచలనంగా మారింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఆడియో గురించే టీఆర్ఎస్తో పాటు అన్ని రాజకీయ పార్టీల్లో చర్చలు జరుగుతున్నాయి.