కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మొదటగా మేం చేసేది ఇదే: రేవంత్ రెడ్డి

by  |
Gandhi-Bhavan-1
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలోని క్రిస్టియన్స్ కు కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పారు. నాంపల్లిలోని గాంధీ భవన్ లో క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రి గీతారెడ్డితోపాటు పలువురు కాంగ్రెస్ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే క్రిస్టియన్స్ ను ఎస్సీ జాబితాలోకి చేర్చుతామని హామీ ఇచ్చారు. రేవంత్ వ్యాఖ్యలపై క్రిస్టియన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇవాళ అక్కడికి రాహుల్, ప్రియాంక వెళ్తున్నారు కానీ,.. సోనియా గాంధీ వెళ్లడంలేదు!



Next Story