సమావేశంలో కార్యదర్శితో రచ్చ.. పురుగుల మందు తాగిన మహిళా సర్పంచ్

by  |
Sarpanch Munja Manjula
X

దిశ, హుస్నాబాద్: గ్రామ పంచాయతీ సమావేశంలో గ్రామ కార్యదర్శికి, సర్పంచ్ కు జరిగిన వాగ్వాదం.. సర్పంచ్ ప్రాణాల మీదకు తెచ్చింది. పల్లె ప్రకృతి వనం నిర్మాణంపై గ్రామ పాలకవర్గ సమావేశంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సిద్దిపేట జిల్లా, కోహెడ మండలం, శ్రీరాములపల్లి గ్రామంలో ఈ సంఘటన జరిగింది.

శ్రీరాములపల్లి సర్పంచ్ ముంజ మంజుల అధ్యక్షతన గురువారం గ్రామపంచాయతీ కార్యాలయంలో పాలకవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన చర్చలో పల్లె ప్రకృతి వనం నిర్మాణానికి వెచ్చించిన నిధుల విషయంలో సర్పంచ్ మంజులకు, గ్రామ కార్యదర్శి సుమలతకు మధ్య గొడవ జరిగినట్లు గ్రామస్తులు పేర్కొంటున్నారు. ఈ గొడవతో మనస్థాపానికి గురైన సర్పంచ్ మంజుల గ్రామ పంచాయతీకి సమీపంలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు సమాచారం. ఆమెను హుటాహుటిన కరీంనగర్ లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

Next Story

Most Viewed