- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, హుస్నాబాద్: గ్రామ పంచాయతీ సమావేశంలో గ్రామ కార్యదర్శికి, సర్పంచ్ కు జరిగిన వాగ్వాదం.. సర్పంచ్ ప్రాణాల మీదకు తెచ్చింది. పల్లె ప్రకృతి వనం నిర్మాణంపై గ్రామ పాలకవర్గ సమావేశంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సిద్దిపేట జిల్లా, కోహెడ మండలం, శ్రీరాములపల్లి గ్రామంలో ఈ సంఘటన జరిగింది.
శ్రీరాములపల్లి సర్పంచ్ ముంజ మంజుల అధ్యక్షతన గురువారం గ్రామపంచాయతీ కార్యాలయంలో పాలకవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన చర్చలో పల్లె ప్రకృతి వనం నిర్మాణానికి వెచ్చించిన నిధుల విషయంలో సర్పంచ్ మంజులకు, గ్రామ కార్యదర్శి సుమలతకు మధ్య గొడవ జరిగినట్లు గ్రామస్తులు పేర్కొంటున్నారు. ఈ గొడవతో మనస్థాపానికి గురైన సర్పంచ్ మంజుల గ్రామ పంచాయతీకి సమీపంలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు సమాచారం. ఆమెను హుటాహుటిన కరీంనగర్ లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.