బండి సంజయ్ ఎంట్రీ.. సిద్దిపేటలో ఉద్రిక్తత

by  |
బండి సంజయ్ ఎంట్రీ.. సిద్దిపేటలో ఉద్రిక్తత
X

దిశ, సిద్దిపేట : సిద్దిపేట మున్సిపల్ ఎన్నికల్లో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. సోమవారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సిద్దిపేట పట్టణ లో ప్రచారంలో పాల్గొన్నాడు. ఈ క్రమంలో ఆయన విక్తర్ టాకీస్ చౌరస్తా నుంచి భారత్ నగర్ వెళ్తుండగా బాసంగారి రమేశ్ విగ్రహం వద్దకు రాగానే మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు వార్డు 24 వ వార్డు కు చెందిన పలువురు టీఆర్ఎస్ నాయకులు బీజేపీ ప్రచారానికి అడ్డుగా వచ్చారు. టీఆర్ఎస్ జిందాబాద్ అంటూ ఆ పార్టీ నాయకులు అనగా.. బీజేపీ జిందాబాద్ అంటూ ఈ పార్టీ నాయకులు నినాదాలు చేశారు. ఒకరిపై మరొకరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. వెంటనే స్పందించిన పోలీసులు ఇరు పార్టీ లతో మాట్లాడి శాంతింప జేయడంతో ఉద్రిక్తత సద్దుమణిగింది.

Next Story