అన్నదమ్ముల మధ్య ఘర్షణ.. తమ్ముడి పరిస్థితి విషమం..

by  |
ci
X

దిశ, పటాన్‌చెరు: కుటుంబ కలహాలు, పాత కక్షలు ఉండటంతో అన్నదమ్ములు తల్వార్‌లతో దాడులు చేసుకున్నారు. పటాన్‌చెరు సీఐ వేణుగోపాల్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. పటాన్‌చెరు పట్టణం లోని చైతన్య నగర్‌లో నివాసం ఉంటున్న నర్సింహ, ప్రవీణ్ ఇద్దరు అన్నదమ్ములు. కొన్ని రోజుల క్రితం నర్సింహా భార్య చికిత్స పొందుతూ ఆస్పత్రిలో మృతి చెందింది. ఈ నేపథ్యంలో సోమవారం అర్ధరాత్రి నరసింహ, అతని కొడుకు శ్రవణ్ కుమార్‌తో పాటు మరో నలుగురు కుటుంబ సభ్యులు కలిసి తల్వార్‌తో తమ్ముడు ప్రవీణ్ పై విచక్షణ రహితంగా దాడి చేశాడు. కత్తులతో ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. ఈ దాడిలో ప్రవీణ్ తలకు, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి.

అడ్డు పోయిన చిరంజీవికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రవీణ్ పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. దాడికి పాల్పడ్డ ఐదుగురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. మరొకరు పరారీలో ఉన్నారు. రఘు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు.

Next Story