ఐదేళ్ల తర్వాత డైరెక్టర్‌గా కరణ్ జోహార్ మూవీ..

by  |
ఐదేళ్ల తర్వాత డైరెక్టర్‌గా కరణ్ జోహార్ మూవీ..
X

దిశ, సినిమా : బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్‌ జోహార్ ఐదేళ్ల తర్వాత డైరెక్టర్‌గా తన నెక్స్ట్ సినిమా ప్రకటించారు. ‘గల్లీ బాయ్’ జోడీ రణ్‌వీర్ సింగ్, ఆలియాభట్‌ హీరోహీరోయిన్లుగా సెలెక్ట్ చేసుకున్న కరణ్.. ‘రాఖీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ’ టైటిల్ ఫైనల్ చేశారు. రణ్‌వీర్ బర్త్ డే సందర్భంగా ఇందుకు సంబంధించిన టైటిల్ టీజర్ అనౌన్స్ చేసిన కరణ్.. త్వరలో షూటింగ్ ప్రారంభం కానున్న ఈ చిత్రాన్ని 2022లో రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. మరోసారి కెమెరా వెనుక నిల్చోవడం, తన ఫేవరేట్ పీపుల్‌ను డైరెక్ట్ చేస్తుండటం థ్రిల్లింగ్‌గా ఉందన్న ఆయన.. ఇషితా మోయిత్రా, శశాంక్ ఖైతాన్, సుమిత్ రాయ్ ఈ చిత్రానికి కథను అందిస్తున్నట్లు తెలిపారు. కాగా ధర్మేంద్ర, జయా బచ్చన్, షబానా అజ్మీ కీలకపాత్రల్లో కనిపించనున్న సినిమా డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ఆడియన్స్‌ను హండ్రెడ్ పర్సెంట్ ఎంటర్టైన్ చేస్తుందన్నారు. జయ ఈ సినిమాలో రణ్‌వీర్ గ్రాండ్ మదర్‌గా నటించనుండగా.. ధర్మేంద్ర, షబానా ఆలియా గ్రాండ్‌ పేరెంట్స్‌గా కనిపించబోతున్నారు.

Next Story

Most Viewed