పాల్వంచలో స్మశాన వాటిక రగడ.. సర్పంచ్ ఎంటరైనా..

by  |
పాల్వంచలో స్మశాన వాటిక రగడ.. సర్పంచ్ ఎంటరైనా..
X

దిశ, కామారెడ్డి: మాచారెడ్డి మండలం పాల్వంచ గ్రామంలో సిరిసిల్లకు వెళ్లే దారిలో ఉన్న చేరువులోనే వైకుంఠ ధామాం ఏర్పాటు చేశారు. వర్షాకాలంలో చెరువులోకి నీరు చేరడంతో వైకుంఠ ధామం మొత్తం నీటితో నిండిపోయింది. దాంతో అంత్యక్రియలు నిర్వహించలేని పరిస్థితి నెలకొంది. అయితే శుక్రవారం వైకుంఠ ధామంలో నీరు నిల్వకుండా ఉండేందుకు అలుగును జేసీబీ సహాయంతో కూల్చేయించారు.

అలుగును కూల్చివేయడంతో కొందరు గ్రామస్థులు శనివారం ఆగ్రహం వ్యక్తం చేశారు. వైకుంఠ ధామంలో నీరు నిలవడంతో బిల్లులు రావని, అందుకోసమే అలుగు కూల్చేశారని ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. దాంతో గ్రామంలో ఘర్షణ వాతావరణం నెలకొంది. గ్రామ సర్పంచ్ ఘటన స్థలానికి చేరుకుని బిల్లుల కోసం కూల్చేయలేదని సర్దిచెప్పే ప్రయత్నం చేశాడు.


Next Story

Most Viewed