భార్య, పిల్లలను ఒంటరినీ చేసిన తండ్రి..!

by  |
computer-shop-owner 1
X

దిశ, ములుగు : కరోనాతో కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ యజమాని మొహమ్మద్ షబ్బీర్(48) మృతి చెందాడు. ఈ ఘటన ఆదివారం ములుగు జిల్లా కేంద్రంలో వెలుగు చూసింది. స్థానికుల కథనం ప్రకారం.. షబ్బీర్ అనే వ్యక్తి 20 ఏళ్లుగా రిలయన్స్ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ నడిపిస్తున్నాడు. గత పదిరోజుల కిందట అతనిలో కరోనా లక్షణాలు కనిపించాయి.

దీంతో ములుగు ఏరియా ఆస్పత్రిలో కరోనా పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ అని తేలింది. నాటి నుంచి వరంగల్ ఎంజీఎంలో అతను చికిత్స పొందుతున్నాడు. ఈ క్రమంలోనే ఆదివారం మధ్యాహ్నం పరిస్థితి విషమించడంతో మృతి చెందాడు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. షబ్బీర్ మృతి పట్ల జిల్లా కేంద్రంలోని పలు వ్యాపార, వాణిజ్య సంస్థల వారు సంతాపం ప్రకటించారు.



Next Story