ఏపీ సీఎం జగన్ కీలక నిర్ణయం

by  |
ఏపీ సీఎం జగన్ కీలక నిర్ణయం
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. భూ సర్వే పైలెట్ ప్రాజెక్టుపై సోమవారం అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం… జనవరి 21, 2021 నుంచి సమగ్ర భూ సర్వే చేపట్టాలని అధికారులను ఆదేశించారు. భూ సర్వే కోసం డ్రోన్లు, రోవర్లు, సర్వే రాళ్లు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. సర్వేయర్లకు అత్యాధునిక టెక్నాలజీపై శిక్షణ ఇవ్వాలని స్పష్టం చేశారు. వివాదాల పరిష్కారానికి మొబైల్ ట్రిబ్యునల్స్‌ ఏర్పాటు చేసి అక్కడికక్కడే సమస్యలను పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ తో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed