కర్ఫ్యూ కాదు.. వీకెండ్ కంప్లీట్ లాక్‌డౌన్..

by  |
కర్ఫ్యూ కాదు.. వీకెండ్ కంప్లీట్ లాక్‌డౌన్..
X

దిశ, వెబ్ డెస్క్ : దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతోంది. ఇందులో భాగంగానే కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో పాజిటివ్ కేసులు భారీగా నమోదు అవుతున్నాయి. దీంతో శుక్రవారం రాత్రి నుంచి సోమవారం వరకు పూర్తిస్థాయి లాక్‌డౌన్ అమలు చేయనున్నట్టు అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ నెల 23వ తేదీ రాత్రి 10 గంటల నుంచి 26 ఉదయం 5 గంటల వరకు లాక్‌డౌన్ అమలు కానుంది.

పుదుచ్చేరిలో రాత్రిపూట కర్ఫ్యూ విధిస్తూ నిర్ణయం తీసుకున్న మరుసటి రోజే(నిన్న కర్ఫ్యూ విధిస్తూ ఆదేశాాలు)లాక్‌డౌన్ ఆదేశాలు వెలువడడం గమనార్హం. కాగా పుదుచ్చేరిలో నిన్న కొత్తగా 4,692 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

Next Story

Most Viewed