- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఏపీ బ్యూరో : పశుసంవర్ధక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజుపై కృష్ణా జిల్లా మైలవరం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అడ్వకేట్ భూక్యా మల్లికార్జున రావు ఆదివారం మంత్రిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎన్440కే కొత్తరకం వైరస్ పుట్టిందని, ఇది కరోనా కంటే చాలా ప్రమాదకరమని మంత్రి అప్పలరాజు చెప్పడం వల్ల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నట్లు మల్లికార్జున రావు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ వైరస్ అంత ప్రమాదకారి కాదని సీసీఎంబీ పరిశోధనలో తేలిందని వివరించారు. మంత్రి పదవిలో ఉండి ప్రజలను ఆందోళనకు గురిచేస్తూ తప్పుడు ప్రచారం చేసిన మంత్రి అప్పలరాజుపై చర్యలు తీసుకోవాలని న్యాయవాది ఫిర్యాదులో కోరారు.
Next Story