ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిపై హెచ్చార్సీలో ఫిర్యాదు

by  |
ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిపై హెచ్చార్సీలో ఫిర్యాదు
X

దిశ, కమలాపూర్: రాజ్యాంగ హక్కులను కాలరాస్తూ టీఆర్ఎస్ పార్టీకి ఓటేయాలని గౌడ కులస్తులతో అమ్మవారిపై ప్రమాణం చేయించినట్లు పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ లో తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఫిర్యాదు చేసింది. వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ మండలంలోని గూడూరు గ్రామంలో మంగళవారం గౌడ కులస్తులతో సమావేశమైన ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి.. గుడి నిర్మాణం కోసం 10 లక్షల రూపాయలు ఇస్తానని, టీఆర్ఎస్ పార్టీకి ఓటేయాలని ఎల్లమ్మ అమ్మవారిపై ప్రమాణం చేయించారని ,ఓటు కోసం ప్రజలకు డబ్బు ఆశ చూపించి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేశారంటూ, బీసీలను ఓట్లు వేసే యంత్రాలుగా చూస్తున్న ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి శాసనసభ సభ్యత్వం రద్దు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాచాల యుగేందర్ గౌడ్ ఫిర్యాదు చేసినట్లు ఒక ప్రకటనలో తెలిపారు.

Next Story

Most Viewed