- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
- లోక్సభ ఎన్నికలు-2024
దిశ ప్రతినిధి , హైదరాబాద్: క్రికెట్ సెలక్షన్లో అవకతవకలకు పాల్పడుతున్న హెచ్.సీ.ఏ పై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని అల్ అఖిల భారత షెడ్యూల్ కులాల , తెగల సంఘాల సమైఖ్య గురువారం రాష్ట్ర మానవ హక్కుల కమిషన్లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు సమైఖ్య రాష్ట్ర అధ్యక్షుడు మహేశ్వర్ రాజ్ మాట్లాడుతూ… విజయ్ హజారే క్రికెట్ ట్రోఫీకి టీమ్ ఎంపికలో ప్రతిభను పరిగణలోకి తీసుకోకుండా, ఇష్టం వచ్చిన వారిని ఎంపిక చేశారంటూ ఆరోపించారు.
అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్న అజారుద్దీన్ నేతృత్వంలో ఈ అవకతవకలు జరుగుతున్నాయని, ఏ సెలెక్షన్ ఉన్న కలెక్షన్ ఆధారంగానే ఆటగాళ్లను ఎంపిక చేస్తున్నారని కమిషన్కు వివరించారు. హెచ్సీసీ ఎంపిక చేసిన జట్టును తక్షణమే రద్దు చేసి, లోదా కమిషన్ సిఫార్సుల మేరకు కొత్త జట్టును ఎంపిక చేయాలని , హెచ్.సి.ఏ అవకతవకలపై విచారణకు ఆదేశించాలని హెచ్చార్సీని మహేశ్వర్ రాజ్ కోరారు.