- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, మల్హర్: తాడిచర్ల ఉపరితల బొగ్గు బావుల్లో సర్వం కోల్పోయిన కాపురం భూనిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద పరిహారం ఇస్తామని జయశంకర్ భూపాలపల్లి జిల్లా జాయింట్ కలెక్టర్ స్వర్ణలత తెలిపారు. బుధవారం మండలంలోని తాడిచర్ల గ్రామ పంచాయతీ ఆవరణలో కాపురం, తాడిచర్ల భూ నిర్వాసితులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మొదటి విడతలో ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద ఒక్కొక్క కుటుంబానికి రూ. 7 లక్షల 61వేల పరిహారం ఇవ్వడం జరుగుతుందని అన్నారు. కాపురంలో 118, తాడిచర్లలో 67 ఇండ్లకు పరిహారం ఇవ్వడం జరుగుతుందని ఆమె నిర్వాసితులకు తెలిపారు. అదేవిధంగా నిర్వాసితులు ఇల్లు నిర్మించుకోవడానికి 9.11 గుంటల భూమిని కేటాయించడం జరిగిందని, ఒక్కొక్క కుటుంబానికి 1,60 పైసల భూమి చొప్పున హద్దులు ఏర్పాటు చేశామని అన్నారు. ఈ విషయంపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే తమ దృష్టికి తెలియపరచాలని ఆమె సూచించారు.