‘దళితబంధు’ అమలు కోసం కమిటీ.. బాస్ ఇతనే!

by  |
cs-somesh-kumar 1
X

దిశ, వెబ్‌డెస్క్: టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ‘దళితబంధు’ ప‌థ‌కాన్ని హుజూరాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలో పైలెట్ ప్రాజెక్టుగా తీసుకుంటున్న విషయం తెలిసిందే. నియోజకవర్గంలోని శాలపల్లి గ్రామంలో సోమవారం ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగానే అయితే, ఈ పథకం అమలు కోసం ఇప్పటికే ఏడుగురు అధికారులతో ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసింది. ఈ ఏడుగురు అధికారులు ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా నేతృత్వంలో విధులు నిర్వర్తించాల్సి ఉంటుందని సీఎస్ సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.

TS-Govt-GO

Next Story

Most Viewed