ఆ సినిమా చూసి జనాలు చంపేస్తారనుకున్నా.. మహేష్ హాట్ కామెంట్స్

by  |
mahesh
X

దిశ, వెబ్‌డెస్క్: మహేష్ అచంట ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. జబర్దస్త్‌తో పరిచయమై ఆ తర్వాత సినిమాల్లో చిన్నచిన్న అవకాశాలు అందుకున్నాడు. అలాగని కామెడీ పాత్రలకే పరిమితం కాకుండా నటనకు ఆస్కారం ఉన్న అవకాశాలు అందుకుంటూ కెరీర్‌లో రాణిస్తున్నాడు. అతడు తాజాగా యంగ్ హీరో శ్రీవిష్ణు అప్‌కమింగ్ సినిమా ‘అర్జున ఫల్గుణ’సినిమాలో నటించాడు. ఈ సినిమా డిసెంబర్ 31న విడుదల కానుంది. ఈ సందర్భంగా సినిమా ప్రమోషన్స్ జరుగుతున్నాయి. వాటిలో పాల్గొన్న మహేష్ తన కెరీర్‌పై హాట్ కామెంట్స్ చేశాడు. తను చేసిన ఓ సినిమా తన జీవితంలో చివరిది అవుతుందని భయపడ్డానని, ఆ సినిమా చూసి తనను ఎక్కడ రాళ్లతో కొడతారో అనుకున్నాని మహేష్ చెప్పుకొచ్చాడు. అది మరేదో సినిమా కాదు. మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘మహానటి’.

ఇందులో సావిత్రిని మోసం చేసి ఆస్తులు కాజేసిన సత్యం పాత్రలో మహేష్ కనిపించాడు. ‘ మహానటి సినిమాలో సత్యం పాత్ర నాకు మంచి గుర్తింపు తెచ్చింది. కానీ ఆ సినిమా చేసిన తర్వాత నేను చాలా భయపడ్డా. మా ఊరు వెళితే అక్కడివారంతా నన్ను తిట్టిపోశారు. ఎక్కడికి వెళ్లినా నీకేం పోయే కాలంరా.. సావిత్రిని అలా మోసం చేశావు అనేవాళ్లు. మరికొందరిని చూస్తే ఎక్కడ రాళ్లతో కొడతారో అని భయమేసేద’ని మహేష్ అన్నాడు. అంతేకాకుండా ఆ పాత్రకు ప్రేక్షకులు అంతలా కనెక్ట్ అయ్యారని చెప్పుకొచ్చాడు. ఇప్పుడు అర్జున ఫల్గుణ సినిమాలో తన పాత్ర కెరీర్ బెస్ట్ అవుతుందని ధీమా వ్యక్తం చేశాడు. మరి సినిమా ఆ స్థాయి రెస్పాన్స్ అందుకుంటుందో లేదో తెలియాలంటే డిసెంబర్ 31 వరకు ఆగాల్సిందే.


Next Story

Most Viewed