భావోద్వేగానికి గురైన సంతోష్‌బాబు సతీమణి సంతోషి

by  |
భావోద్వేగానికి గురైన సంతోష్‌బాబు సతీమణి సంతోషి
X

దిశ, వెబ్‌డెస్క్: యాదాద్రి భువనగిరి జిల్లా ట్రైనింగ్ కలెక్టర్‌ సంతోషి భావోద్వేగానికి గురయ్యారు. కేంద్రం తన భర్త సంతోష్‌బాబుకు మహావీర్‌చక్ర పురస్కారం అందించడం గర్వంగా ఉందని, దేశం కోసం ప్రాణాలర్పించిన తన భర్త అందరికీ ప్రేరణగా ఉంటారని అన్నారు. మా పిల్లలు వాళ్ల నాన్నను చూసి గర్విస్తున్నారని మీడియాతో మాట్లాడుతూ కంట నీరు పెట్టుకున్నారు. మంగళవారం రిపబ్లిక్ డే వేడుకల్లో వేడుకల్లో భాగంగా కలెక్టరేట్‌లో కలెక్టర్ అనితా రామచంద్రన్ జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం గతేడాది భారత్-చైనా సరిహద్దు ఘర్షణలో వీరమరణం పొందిన కల్నల్ సంతోష్‌బాబు సతీమణి సంతోషిని కలెక్టర్‌ అనితా రామచంద్రన్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పైళ్ల శేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.



Next Story

Most Viewed