పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనుల పరిశీలన

by  |
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనుల పరిశీలన
X

దిశ, నాగర్ కర్నూల్: పాలమూరు -రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులను సోమవారం నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ శర్మన్ పరిశీలించారు. మొదట ఎల్లూరు రిజర్వాయర్‌ పనులను పరిశీలించారు. అనంతరం జీరో పాయింట్‌ వద్ద పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు నమూనాను జిల్లా కలెక్టర్‌కు ఇంజనీర్లు వివరించారు. అనంతరం రిజర్వాయర్‌ బ్యాక్‌ వాటర్‌ పంపుహౌజ్, జలాశయం పనులు, ఏదుల జలాశయం పనులను సంబంధిత ఇంజినీరింగ్ అధికారులతో కలసి కలెక్టర్ శర్మన్ పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులు మ్యాప్ ద్వారా ప్రాజెక్టు పనులపై ప్రజెంటేషన్‌ ఇచ్చారు.

ప్రాజెక్టు అధికారులు మాట్లాడుతూ.. ఆసియాలోనే పాలమూరు రికార్డు సృష్టించనుందని.. 41 అధునాతన పంపులతో దీన్ని చేపడుతున్నామన్నారు. ప్రాజెక్టు టన్నెల్‌ పనులను కలెక్టర్‌కు ఇంజినీరింగ్ అధికారులు చూపించారు. కిలోమీటర్ల మేర టన్నెల్‌లో ప్రయాణించి సొరంగం నిర్మాణం, ప్రాజెక్టు ప్రగతిపై కలెక్టర్ వారితో చర్చించారు. కలెక్టర్ వెంట ప్రాజెక్ట్ ఇంజినీరింగ్ అధికారి విజయ భాస్కర్ రెడ్డి, ఇతర ఇంజినీరింగ్ అధికారులు ఉన్నారు.

Next Story