607 పెండింగ్ చెక్కులు క్లియర్

by  |
607 పెండింగ్ చెక్కులు క్లియర్
X

దిశ ప్రతినిధి, మహబూబ్‌నగర్: జిల్లాలో పెండింగులో ఉన్న 607 కల్యాణ లక్ష్మి , షాదీ ముబారక్‌కు సంబంధించిన చెక్కులన్నీ లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు ట్రెజరీ ద్వారా క్లియర్ చేయించి, తహసీల్దార్లకు పంపించినట్టు కలెక్టర్ ఎస్.వెంకటరావు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇందులో ఎస్సీలకు సంబంధించి 77, ఎస్టీలకు సంబంధించి 61, షాదీ ముబారక్‌కు సంబంధించిన చెక్కులు 262, బీసీ, ఓబీసీ చెక్కులు 207, మొత్తం 607 చెక్కులు తహసీల్దార్లకు పంపినట్టు ఆయన తెలిపారు. ఈ చెక్కులన్నీ సంబంధిత తహసీల్దార్ల ద్వారా లబ్ధిదారులకు అందజేయనున్నట్టు కలెక్టర్ స్పష్టం చేశారు.

Next Story

Most Viewed