పునరావాస కేంద్రాల్లో కలెక్టర్ తనిఖీలు

by  |
పునరావాస కేంద్రాల్లో కలెక్టర్ తనిఖీలు
X

దిశ, మేడ్చల్: దుండిగల్, మేడ్చల్, కొంపల్లి, గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీల్లో వలస కార్మికుల కోసం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలను జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా లాక్‌డౌన్ ప్రకటించిన నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఈ కేంద్రాల్లో ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన వారికోసం భోజన, మంచినీటి సదుపాయంతో పాటు వైద్యం, మరుగుదొడ్లు, రాత్రికి బస ఏర్పాట్లు చేశామని వివరించారు. ఆయా కేంద్రాల్లోని వలస కార్మికులను అడిగి భోజన సదుపాయం, వసతి గురించి అడిగి తెలుసుకున్నారు. వైద్య శిబిరాన్ని పరిశీలించి కావాల్సిన అన్ని మందులను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. మేడ్చల్ ప్రభుత్వ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ సెంటర్‌ను పరిశీలించారు. అక్కడ మరుగుదొడ్లు లేకపోవడాన్ని గుర్తించి వెంటనే నిర్మించాలని అధికారులను ఆదేశించారు.

tag: Collector, checks, rehab centers, medchal


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed