- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, జన్నారం : యాసంగిలో వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతి హోళీకేరి రైతులకు సూచించారు. జన్నారం గ్రామంలో శుక్రవారం ఏర్పాటు చేసిన రైతు అవగాహన సదస్సులో కలెక్టర్ మాట్లాడారు. యాసంగిలో వరి పంటను కొనుగోలు చేయలేమని కేంద్ర ప్రభుత్వం చెప్పడంతో తెలంగాణ గవర్నమెంట్ కూడా కొనుగోలు చేసేందుకు సిద్ధంగా లేనందున రైతులు ఆలోచించి తగిన నిర్ణయం తీసుకోవాలని కోరారు.
వరికి బదులుగా మినుములు, మొక్కజొన్న, వేరుశనగ, పెసర తదితర పంటలు వేసుకోవాలని సూచించారు. ఒకవేళ వరి సాగు చేసుకుంటే రైతులే ఎక్కడైనా అమ్ముకోవాల్సి వస్తుందన్నారు. వరి సాగుచేసి రైతులు ఇబ్బంది పడకుండా ఆరుతడి పంటలు సాగు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి వినోద్ కుమార్ తహశీల్దార్ పుష్పలత, ఎంపీపీ సరోజన, ఎంపీడీవో అరుణ రాణి, మండల వ్యవసాయాధికారి సంగీత ఏఈఓలు త్రి సంధ్య అక్రమ్ తదితరులు రైతులు పాల్గొన్నారు.